NRA నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ

Aug 19, 2020 - 03:39
Sep 23, 2020 - 13:09
 0

నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త.. ఇకపై అన్ని ఉద్యోగాలకు ఒకే పరీక్ష నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన చేశారు. ఈ మేరకు NRA ఏర్పాటుకు బుధవారం కేంద్రకేబినెట్ ఆమోద ముద్రవేసింది. నిరుద్యోగులకు అన్ని ఉద్యోగాలకు ఒకే పరీక్ష. దేశంలోని నిరుద్యోగులకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జాతీయ స్థాయిలో నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (NRA)ని ఏర్పాటు చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

NRA ఏర్పాటుతో నిరుద్యోగులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. ప్రతి ఏటా సుమారు 1.25 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. సుమారు 2.5 కోట్ల మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. ఐతే వేర్వేరు శాఖలకు సంబంధించిన ఉద్యోగాలకు వేర్వేరు పరీక్షలను నిర్వహిస్తున్నారు. రైల్వే, ONGC, NTPC, బ్యాంకులు పలు ఉద్యోగాలకు ఆయా శాఖలే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఐతే ఇకపై వీటన్నింటింటికీ ఒకే పరీక్ష (CET) నిర్వహిస్తారు. ఆ పరీక్షలో సాధించిన స్కోరుకు మూడేళ్ల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ స్కోర్ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మళ్లీ మళ్లీ పరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు. నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన చేశారు. ఈ మేరకు NRA ఏర్పాటుకు బుధవారం కేంద్రకేబినెట్ ఆమోద ముద్రవేసింది. NRA ద్వారా అన్ని నాన్ గెటిజెట్ పోస్టులు, ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగాలకు ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. తద్వారా ఇటు ప్రభుత్వం, అటు అభ్యర్థులు ఖర్చు తగ్గుతుంది. సమయం కూడా కలిసి వస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంపై నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తోంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow